telugu navyamedia
రాజకీయ వార్తలు

ప్రత్యామ్నాయ విద్యుత్ గా సౌరశక్తి : ప్రధాని మోదీ

modi on jammu and kashmir rule

భారత్ లోనూ సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ఊపందుకుంది. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ లోని రేవాలో ఏర్పాటు చేసిన 750 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు.

వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ రేవాలోనీ ఈ సోలార్ ప్లాంట్ ఇక్కడి పరిశ్రమలకు విద్యుత్ అందిస్తుందన్నారు. ఢిల్లీ మెట్రో రైలు వ్యవస్థకు కూడా ఈ విద్యుత్తు ఉపయోగపడుతుందని చెప్పారు. రేవా మాత్రమే కాకుండా, షాజాపూర్, నీముచ్, ఛత్తర్ పూర్ లోనూ ప్రత్యామ్నాయ విద్యుత్ గా సౌరవిద్యుత్ కేంద్రాలు నిర్మాణం జరుపుకుంటున్నాయని వివరించారు.

Related posts