న్యూ ఇయర్ సందర్భంగా ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో వినియోగదారులకు శుభవార్త చెప్పింది. జియో మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటిచింది. జనవరి నుంచి ఏ నెట్వర్క్ అయినా.. ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చని ప్రకటించింది. అయితే.. ఒక నెట్వర్క్ నుంచి మరో మొబైల్ నెట్వర్క్కు ఫోన్ చేసినపుడు ఇన్ కమింగ్ నెట్వర్క్కు కాల్ చేసిన నెట్వర్క్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దీన్ని ఇంటర్ కనెక్ట్ యూజెస్ ఛార్జెస్ అంటారు. ఈ విధానాన్ని జనవరి 1, 2020 నుంచి తొలగించడానికి కేంద్రం సమ్మతించింది. అయితే.. ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా దీన్ని వ్యతిరేకించడంతో పొడగిస్తూ 2019 సెప్టెంబర్లో ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ రోజుతో ఐయూసీ అమలు గడువు ముగుస్తుండటంతో జియో మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఐయూసీ విధానం రద్దయిన తర్వాత మళ్లీ ఉచిత వాయిస్ కాల్స్ సేవలను పునరుద్దరిస్తామని గతంలోనే ప్రకటించినట్లు జియో ప్రకటించింది. ఇక జియో తాజా నిర్ణయంతో జనవరి 1 నుంచి ఏ నెట్వర్క్కైనా ఉచిత వాయిస్ కాల్స్ చేసుకువచ్చు.


తెలుగు రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి: ఎర్రబెల్లి