మెగా కోడలు ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం లభించింది. ఉపాసన బిజినెస్ ఉమెన్గా, సామాజిక వేత్తగా, మెగజీన్ ఎడిటర్గా రాణిస్తున్న ఆమెకి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్నారు.
ఆమె చేసే సేవా, సామాజీక కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవనక్కర్లేదు. అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ ద్వారా ఆమె నిత్యం హ్యుమన్ లైఫ్, వైల్డ్ లైఫ్ కోసం ఆమె నిత్యం కృషి చేస్తుంటారు.
ఈ క్రమంలో ఆమెకు ప్రతిష్టత్మక అవార్డు నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డు వరించింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఆమె ఈ పురస్కారాన్నిఅందుకోనున్నారు.
హ్యూమన్ లైప్ తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన. ఈ దిశగా తన సేవలను ఆపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ గా కొనసాగిస్తున్నారు.
ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తాతయ్య, అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనే ఆయన లక్ష్యమే తనకు స్ఫూర్తినిచ్చిందని చెప్పారు.
రికార్డు సృష్టిస్తోన్న ‘ఆర్ఆర్ఆర్’ టీజర్