లాక్ డౌన్తో షూటింగ్లు మొత్తం బంద్ అయ్యాయి.థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారో చెప్పలేని పరిస్థితి. ఆల్రెడీ షూటింగ్లు కంప్లీట్ చేసుకుని విడుదలకు రెడీగా ఉన్న రెడ్, వి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, ఉప్పెన, ఓరేయ్ బుజ్జిగా లాంటి చిత్రాలను థియేటర్స్లో విడుదల చేయలేక.. ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో రిలీజ్ చేసే ధైర్య చేయలేక నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఈ తరుణంలో ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా మరో ఏడాది వరకూ థియేటర్స్ బంద్ ఉన్నట్టే అంటున్నారు బాలీవుడ్ నటి, బ్రూస్ లీ-సర్దార్ గబ్బర్ సింగ్ ఫేమ్ టిస్కా చోప్రా. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ప్రేక్షకులు థియేటర్స్కి వెళ్లి సినిమాలు చేసే పరిస్థితి లేకపోవడంతో చాలా మంది అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, ఆహా, జీ 5 లాంటి ఓటీటీ ఫ్లాట్ఫామ్స్కి అలవాటు పడ్డారని.. భవిష్యత్లో థియేటర్స్ తెరుచుకున్నా ఇంట్లో ఉండి సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారంటున్నారు టిస్కా చోప్రా. ఫ్యామిలీతో చూడాలంటే తడిచిమోపెడు అవుతున్న తరుణంలో చాలా మంది ఓటీటీ ఫ్లాట్ఫామ్స్పై మొగ్గు చూపిస్తున్నారనన్నారామె. ప్రస్తుతం కరోనా భయం ప్రజల్ని ఇప్పట్లో వదిలే పరిస్థితి లేదు. దీని ప్రభావం థియేటర్స్పై ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇతర దేశాల్లో థియేటర్స్ తిరిగి ఓపెన్ చేసినా.. ప్రేక్షకులు ఎవరూ రావడం లేదు. వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఎక్కువ ఉందనే అభిప్రాయంలో ఉన్నారు. ఒక ఏడాది పాటు థియేటర్స్ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. అంటూ ఇన్ స్టాగ్రామ్లో వరుస పోస్ట్లు చేశారు టిస్కా చోప్రా.