రాజమౌళికి సెంటిమెంట్ల పై జాతకాల పై నమ్మకం తక్కువ. అయినప్పటికీ ‘ఆర్ ఆర్ ఆర్’ అనుకున్న విధంగా ముందుకు నడవకుండా ఏకంగా రాజమౌళికి చుక్కలు చూపెడుతున్న పరిస్థితులలో రాజమౌళి ఒక ఊహించని సెంటిమెంట్ వైపు అడుగులు వేస్తున్నాడు. ‘ఆర్ ఆర్ ఆర్’ కథ రీత్యా ఒక భారీ షెడ్యూల్ పూనే చుట్టుపక్కల తీయడానికి రాజమౌళి చాలసార్లు ప్రయత్నించాడు. అయితే చరణ్ జూనియర్ లకు గాయాలు అవ్వడం ఆతరువాత ఈ మూవీ ప్రాజెక్ట్ నుండి బ్రిటీష్ బ్యూటీ డైసీ తప్పుకోవడం అలియా భట్ తో డేట్ సమస్యలు ఇలా అనేక ఊహించని సమస్యలు ఎదురు కావడంతో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సంబంధించిన కీలకమైన పూణే షెడ్యూల్ ను ఎంత ప్రయత్నించినా కొనసాగించలేకపోయాడు.
ఇవన్నీ చూస్తుంటే, తనకు పూణే కలిసి రావడం లేదనీ భావించిన జక్కన్న పూణెలో తీయాలనుకున్న సన్నివేశాలన్ని ఇకపై తమిళనాడులో తీయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన ప్రదేశం కూడ ఫైనల్ కావడంతో వచ్చేనెల నుంచి ఏకథాటిగా 35 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుందని తెలుస్తోంది. ఎక్కువభాగం ఈ షెడ్యూల్ ఎన్టీఆర్ పైనే షూటింగ్ ఉంటుందనీ ఒక వారం రోజుల పాటు తారక్-చరణ్ కాంబినేషన్ లో సీన్స్ ఉండబోతాయి అన్న లీకులు వస్తున్నాయి. ఈ షెడ్యూల్ అనుకున్న విధంగా పూర్తి చేయగలిగితే ఈమూవీ షూటింగ్ ఇంచుమించు 50 శాతం వరకు పూర్తి అవుతుందని అంటున్నారు. అయితే ఈ కొత్త ప్రదేశంలో అయినా రాజమౌళి అనుకున్నట్లుగా ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కొనసాగాలి అంటే ప్రకృతి సహకరించాలి. లేకుంటే ప్రకృతి ఈ సారి ‘ఆర్ ఆర్ ఆర్’ కు శత్రువుగా మారే ఆస్కారం ఉంది..
సినీ పరిశ్రమ కోసం మేము కూడా ఏపీ సీఎంను కలుస్తాం..