కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తెలంగాణలో రాహుల్ రెండ్రోజులు పర్యటించనున్నారు.ఈ మేరకు పార్టీ వర్గాలు రాహుల్ తెలంగాణ షెడ్యూల్ వివరాలను వెల్లడించాయి.
రేపు సాయంత్రం 4.50 గంటలకు ప్రత్యేకవిమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడ కాంగ్రెస్ నేతలు రాహుల్ కు స్వాగతం పలుకుతారు. 5.10 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్లో వరంగల్ బయలుదేరి 5.45 గంటలకు వరంగల్లోని గాబ్రియెల్ స్కూలుకు చేరుకుంటారు. 6.05 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ పాల్గొంటారు. రాత్రి 8 గంటలకు రోడ్డు మార్గం ద్వారా వరంగల్ నుంచి బయలుదేరి రాత్రి 10.40 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం రాత్రికి బంజారాహిల్స్లోని తాజ్కృష్ణలో బస చేస్తారు.
మే 7వ తేదీ మధ్యాహ్నం 12:30కి తాజ్కృష్ణ నుంచి బయలుదేరి 12:50కి సంజీవయ్య పార్కుకు చేరుకుంటారు. 12:50- 1:10 గంటల మధ్య దివంగత మాజీ సీఎం సంజీవయ్యకు నివాళులు అర్పిస్తారు. 1:15కు అక్కడి నుంచి బయలుదేరి 1:30కి గాంధీభవన్ చేరుకుంటారు. 1:45 నుంచి 2:45 వరకు అక్కడ పార్టీ నాయకులతో సమావేశం అవుతారు. పార్టీ నేతలతో రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం, ఎన్నికల వ్యూహాలపై చర్చించనున్నట్టు సమాచారం. అనంతరం మెంబర్షిప్ కోఆర్డినేటర్లతో ఫొటోలు దిగుతారు. ఆ తర్వాత 4 గంటలకు గాంధీభవన్ నుంచి రోడ్డు ద్వారా ఎయిర్పోర్టుకు వెళతారు. 5:50 కి దిల్లీ తిరుగు పయనమవుతారు.
ప్రశ్నించాలనే ప్రజలు నన్ను గెలిపించారు: రేవంత్