telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన కేసీఆర్‌

bonalu kcr hyderabad

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు, బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ అర్చకులు సీఎం కేసీఆర్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

అమ్మవారి దర్శనం కోసం ఆదివారం ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. ఆషాఢమాసంలో జరిగే బోనాలకు ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అన్నీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇక్కట్లు లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. కేసీఆర్ రాక సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

Related posts