వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య ఘటనపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శంషాబాద్ అంబేద్కర్ విగ్రహం నుంచి పోలీస్ స్టేషన్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని శంషాబాద్ లో కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
భవిష్యత్ లో ఏ పోకిరీలూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా ఆ శిక్ష ఉండాలని విద్యార్థులు రోడ్డేక్కారు. దీంతో రోడ్లన్నీ జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. విద్యార్థుల ర్యాలీతో శంషాబాద్ లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను దారి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు.


శ్రీవారి లడ్డూతో వ్యాపారం చేయడం తప్పు: రమణ దీక్షితులు