విజయవాడలోని కోవిడ్ సెంటర్గా వినియోగిస్తోన్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో లో మృతుల సంఖ్య 9కి చేరింది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ట్వీట్ చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ ప్రమాదంపై సీఎం జగన్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నానని వివరించారు.
ఈ ప్రమాద ఘటనపై ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచారం వ్యక్తం చేశారు. ‘విజయవాడలోని కొవిడ్ కేర్ సెంటర్ లో ఇవాళ తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాద ఘటన విచారకరం. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఆయన ట్వీట్ చేశారు.
తండ్రి వైఖరికి విరుద్ధంగా జగన్ వ్యవహరిస్తున్నారు: గల్లా జయదేవ్