telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ముగిసిన ప్రధాని తెలంగాణ పర్యటన ..భీమవరం చేరుకున్న‌ ప్రధాని..

తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన ముగిసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో అల్లూరి సీతారామ రాజు 125వ జయంతి వేడుక‌ల్లో పాల్లొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ చేరుకున్నారు .

ఈ సందర్భంగా  ప్రధానికి గవర్నర్‌ బిశ్వభూషణ్‌, సీఎం జగన్‌ స్వాగతం పలికారు. గన్నవరం నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బ‌య‌లుదేరారు.

భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహావిష్క‌రిస్తారు . అనంత‌రం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో పాల్గొని ప్రధాని ప్రసంగిస్తారు.ప్రధాని పర్యటనతో భీమవరంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

మ‌రోవైపు  భీమరవం పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు. ‘‘గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు హాజరయ్యేందుకు భీమవరం బయలుదేరాను.

అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని కూడా ఆవిష్కరించనున్నాను. ఇది ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను మెరుగుపరుస్తుంది’’ అని మోదీ ట్వీట్ చేశారు.

Related posts