telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి ముందు లొంగిపోయిన మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు

మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు అగ్రనేతలు తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి ముందు అధికారికంగా లొంగిపోయారు. దశాబ్దాల కాలం పాటు అజ్ఞాతంలో ఉన్న వీరు డీజీపీ ముందు లొంగిపోయారు.

తిప్పిరి తిరుపతి (అలియాస్ దేవుజి/దేవ్ జీ), పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు మరియు సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌ఛార్జ్. ఈయనపై ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు రూ. 1.5 కోట్ల బహుమతి ఉంది.

మల్లారాజి రెడ్డి (అలియాస్ సంగ్రామ్), మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు . బడే చొక్కారావు (అలియాస్ దామోదర్/జగన్), తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి. నూనె నరసింహ రెడ్డి (అలియాస్ గంగన్న), రాష్ట్ర కమిటీ సభ్యుడు.

ఈ అగ్రనేతల లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి చెందిన అత్యున్నత స్థాయి నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయిందని, తెలంగాణ రాష్ట్ర కమిటీ పూర్తిగా నిర్వీర్యమైందని పోలీసులు ప్రకటించారు.

లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున వెంటనే రివార్డు సొమ్ము అందజేయడంతో పాటు, సరైన పునరావాసం కల్పిస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.

ఇప్పటికీ అజ్ఞాతంలో ఉన్న ఇతర మావోయిస్టులు కూడా జనజీవన స్రవంతిలోకి రావాలని పోలీసులు పిలుపునిచ్చారు.

Related posts