telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

అయోధ్య కేసు : .. మరో గంట విచారణకు .. కేటాయింపు..

Supreme Court

అయోధ్య కేసు విచారణ సమయాన్ని అదనంగా ఒక గంట పొడిగిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొంది. సోమవారం నుండి విచారణ ముగిసే అక్టోబర్‌ 18 వరకు ప్రతిరోజూ ఒక గంట సమయం అదనంగా కేసు విచారించాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించుకుంది. జస్టిస్‌ రంజన్ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం చేపడుతున్న విచారణ 28వ రోజుకు చేరుకుంది. రోజువారీ విచారణ సాయంత్రం 4 గంటలకు ముగుస్తుండగా, మరో గంట పెంచుతూ ఐదింటికి ముగిస్తామని హిందూ, ముస్లిం పక్షాల తరుపు న్యాయవాదులకు తెలిపింది.

సెప్టెంబర్‌ 23 నుండి అదనంగా ఒక గంట కూర్చుంటామని ధర్మాసనం తెలిపింది. రాజకీయ ప్రభావితం చేయగల ఈ కేసు విచారణను వచ్చే నెల 18కి విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. నవంబర్‌లో తీర్పు వెలువడే అవకాశాలున్నాయి.

Related posts