బీఆర్ఎస్ తో ఎలాంటి పరిస్థితుల్లోనూ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు తేల్చిచెప్పారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ను గద్దె దించడానికి ఈ రెండు పార్టీలు కలుస్తాయంటూ వస్తున్న ఊహాగానాలకు ఆయన తెరదించారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం పలువురు బీఆర్ఎస్ నేతలకు ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్.. రెండు పార్టీలూ తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని ఎంఐఎంకు అప్పగిస్తున్నాయని తీవ్రంగా విమర్శించారు.
ఈసారి ప్రజలు బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.

