ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్థానంలో ఆయన భార్య సునేత్రా పవార్ను ఉప ముఖ్యమంత్రిగా నియమిస్తూ ఎన్సీపీ కీలక నిర్ణయం తీసుకుంది.
నేడు సాయంత్రం ఆమె డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈరోజే ఆమె ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఒక్క నిర్ణయంతో అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీలోని రెండు వర్గాలు ఏకం అవుతాయన్న ప్రచారనికి తెర పడినట్లయింది.
మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒ మహిళ ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టటడం ఇదే తొలి సారి. 1978వ సంవత్సరంలో రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభమైనప్పుడు ఈ పదవిని సృష్టించారు.
అయితే ఇప్పటి వరకు ఏ మహిళా నాయకురాలు కూడా ఈ హోదాలో పని చేయలేదు. అజిత్ పవార్ మరణం తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయాలని ఎన్సీపీ నాయకులు గట్టిగా కోరడంతోసునేత్రా పవార్ ఇందుకు అంగీకరించారు.
నేడు ముంబైలో జరిగే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఆమెను ఎన్సీపీ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం సాయంత్రం రాజ్భవన్లో ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది.

