telugu navyamedia
రాజకీయ వార్తలు

నేడు చివరి ఏడవ దశ పోలింగ్ వారణాసి స్థానం నుంచి నరేంద్ర మోదీ పోటీ లో ఉన్నారు

దేశంలో సార్వత్రిక ఎన్నికలు 2024 చివరి దశకు చేరుకున్నాయి.

పోలింగ్లో భాగంగా ఏప్రిల్ 19వ తేదీన ప్రారంభమైన తొలిదశ పోలింగ్ జూన్ 1వ తేదీ వరకు సాగింది.

ఇక చివరి విడత పోలింగ్లో మొత్తం 57 నియోజకవర్గాలున్నాయి.

ఇవన్నీ ఎనిమిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.

ఉత్తర్ ప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, చండీగఢ్ రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుంది.

ఈ సారి బరిలో 904 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.

చివరి విడతలో ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి కూడా ఉంది.

Related posts