telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీలో మరికొన్నింటికి సడలింపులు!

People queue standing in circles drawn to maintain safe distance as they wait to buy grocery items during a 21-day nationwide lockdown to limit the spreading of Coronavirus disease (COVID-19), in Kolkata

ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనల నుంచి మరికొన్ని సడలింపులు ఇచ్చింది. ఈ మేరకు ఇస్తూ సర్కారు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నగలు, బట్టలు, చెప్పులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిని ఇచ్చింది. స్ట్రీట్ ఫుడ్స్‌ సైతం తెరుచుకోవచ్చని తెలిపింది. ఆయా షాపులు అనుసరించాల్సిన విధానాలపై సర్క్యులర్ ను జారీ చేసింది.

పెద్ద షోరూమ్‌లకు వెళ్లాలంటే ముందే ఆన్‌లైన్‌లో అనుమతి తీసుకోవాలని ఆ సర్య్కులర్‌లో పేర్కొన్నది. బట్టల దుకాణాల్లో ట్రైల్‌ రూమ్‌లకు అనుమతిని నిరాకరించారు. ఇక రోడ్లపై ఆహారం అమ్మేవారు ప్లేట్స్ రూంలో కాకుండా పార్సిల్ అందించ వచ్చని సర్కారు ఇచ్చిన ఆదేశాల్లో తెలిపారు. అయితే ప్రభుత్వం వద్ద నమోదు చేసుకున్న వారే ఆహార విక్రయ బండ్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

Related posts