నేడు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రాజమహేంద్రవరం పర్యటన.
రాజమండ్రి లో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పార్టీ పరమైన సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు.
రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్కు ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
పర్యటనలో భాగంగా ముందుగా రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో నూతనంగా నిర్మించిన భవనాలను మంత్రి లోకేశ్ ప్రారంభించనున్నారు.
అనంతరం అక్కడ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి అభిప్రాయాలు, సమస్యలను నేరుగా తెలుసుకోనున్నారు.
ఆ తరువాత ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ లో నిర్మించిన పలు నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
విద్యా మౌలిక సదుపాయాల బలోపేతమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేయనున్నారు.
అనంతరం రాజమహేంద్రవరంలోని చెరుకూరి వీర్రాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో జరిగే కార్యక్రమాల్లో మంత్రి లోకేశ్ పాల్గొంటారు.
ముందుగా రాజమహేంద్రవరం, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన ఉత్తమ కార్యకర్తలతో సమావేశమవుతారు.
తదుపరి ఇదే నియోజకవర్గాల ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించి పార్టీ బలోపేతం, రాబోయే రాజకీయ కార్యాచరణపై చర్చించనున్నారు.

