సినీ రంగంలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే టాప్ స్తానికి చేరుకుంది మైత్రి మూవీస్. తెలుగులోని అగ్రహీరోలతో భారీ హిట్ సినిమాలు తెరకెక్కించారు. మహేష్, ఎన్టీఆర్లతో కూడా హిట్ సినిమాలు చేశారు. అయితే వీరు అగ్రహీరోలతో ఇండస్ట్రీ హిట్లు అందుకున్నా, చిన్న హీరోల విషయంలో మాత్రం వీరికి అంతగా కలిసి రాలేదు. చిన్న హీరోతో వీరు సినిమా చేస్తే ఆ సినిమా హిట్ టాక్ కూడా అందుకోవడం లేదు. దీనిని బట్టి మైత్రి మూవీస్ వారికి స్టార్ హీరోలే కలిసొచ్చినట్లు ఉంది. ఇదిలా ఉంటే మైత్రి మూవీస్ వారు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రగా హీరో అనే సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారని గత కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా ఇప్పుడు మైత్రి మూవీస్ వారు తమిళ పరిశ్రమలోకి ఎంట్రీని ఘనంగా ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దళపతి విజయ్తో భారీ సినిమా చేసేందుకు మైత్రి మూవీస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను కూడా మాస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజన్ డైరెక్ట్ చేయనున్నారంట. ఈ సినిమాని రెండు భాషల్లో తెరకెక్కించాలని ఆలోచనలు చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
సినీ పరిశ్రమలోని పెద్దల పిల్లలు కూడా డ్రగ్స్ వాడతారు… దివ్యవాణి సంచలన వ్యాఖ్యలు