ప్రముఖ సినీ జర్నలిస్ట్ ప్రభు అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. జనరల్ చెకప్ కోసం వెళ్లిన ఆయనకు హార్ట్లో 80 శాతం బ్లాక్స్ ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.
దీంతో ఈ విషయమై ఆయన మెగాస్టార్ చిరంజీవిని సాయం కోరగా ఆస్పత్రికి రిఫర్ చేసి వెంటనే ఆయనకు చికిత్స అందేలా చేశారు.
దీంతో ఎలాంటి ఖర్చు లేకుండ సర్జరీ లేకుండా జస్ట్ స్టంట్స్ వేసి , వైద్యులు ఆయనను పంపించారు.
ప్రస్తుతం కోలుకుంటున్న జర్నలిస్ట్ ప్రభు స్వయంగా తన ఆరోగ్యంపై స్పందించారు.
గత మూడు రోజులుగా నా ఆరోగ్యం పట్ల ఆందోళన, నాపట్ల అభిమానాన్ని వ్యక్తం చేస్తూ మెసేజ్లు పెట్టిన..పెడుతున్న సాటి పాత్రికేయ మిత్రులు, శ్రేయోభిలాషులందరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
అలాగే హాస్పిటట్కు వచ్చి నన్ను పరామర్శించిన ఇండస్ట్రీ పెద్దలు మురళీ మోహన్ గారికి, హీరో శ్రీకాంత్ గారు, తమ్ముడు ఉత్తేజ్కి అలాగే స్వయంగా ఇంటికి వచ్చి పరామర్శించిన పాత్రికేయ మిత్రులు, ఫోన్ కాల్ ద్వారా, మెసేజ్ ల ద్వారా నన్ను పరామర్శించిన చలనచిత్ర ప్రముఖులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
ఇక విషయం చెప్పగానే మెగాస్టార్ చిరంజీవి గారు వెంటనే స్పందించడం వల్లనే నేను ఆపరేషన్కు వెళ్లాను.
లేదంటే తర్వాత చూసుకుందాంలే అన్న చిన్న నిర్లక్ష్యం ఉండేది. కానీ ఆయన చూపించిన కన్సర్న్ వల్లనే ఇదంతా జరిగింది.
కేవలం సెకండ్ ఒపీనియన్ కోసం ఒక మంచి డాక్టర్ని సజెస్ట్ చేస్తారేమో అని ఆయనకు మెసేజ్ పెట్టడం జరిగింది.
కానీ ఆయన దగ్గరుండి అన్ని చూసుకున్నారు. అంతేకాదు వెంటనే నేను ఆపరేషన్ చేయించుకునేలా ఆయన నన్ను పరుగులు పెట్టించి నా ఆరోగ్యం కుదుటపడేలా చేశారు.
కాబట్టి ప్రస్తుత సందర్భంలో పరిస్థితిలో ‘ధన్యవాదాలు’ అనే పదం నా భావాలను, భావోద్వేగాలను సూచించడానికి సరిపోదు.
కానీ నాకు డిక్షనరీలో ‘థ్యాంక్స్’ కంటే బేటర్ పదం దొరకడం లేదు. అయినా ఈ సందర్భంగా మెగాస్టార్ గారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.

