*ఓటుకు నోటు కేసులో చంద్రబాబు ఏపీకి పారిపోయి వచ్చారు..
*నాపై దుష్ర్పచారంపై న్యాయపోరాటం చేస్తా..
*ఓటుకు నోటు వీడియో తనది కాదని చంద్రబాబు ప్రమాణం చేస్తే ..తాను కూడా ప్రమాణం చేస్తా..
ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్తో టీడీపీ మరోసారి దొరికిపోయిందన్నారు హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ సర్క్యూలేట్ చేస్తున్న సర్టిఫికెట్ తాము ఇచ్చింది కాదని ఎక్లిప్స్ సంస్థ ప్రకటించిందని వెల్లడించారు.
అధికారం కోసం చంద్రబాబు ఇంత నాటకాలాడాల్సిన అవసరం లేదని విమర్శించారు. .ఓటుకు నోటు కేసులో దొంగలా దొరికిపోయి పారిపోయి వచ్చారంటూ గోరంట్ల ఎద్దేవా చేశారు. సదరు ఆడియో టేపులో చంద్రబాబు మాటలు, ఆయన పంపించిన మనిషి డబ్బులు ఇచ్చిన వీడియో కూడా వుందని మాధవ్ అన్నారు.
ఓటుకు నోటు కేసుపై ఒక్కసారైనా చర్చ పెట్టాలని ఈటీవీ, టీవీ5, ఏబీఎన్లను బీసీ సోదరులు కోరాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆడపిల్ల కనిపిస్తే ముద్దాయినా పెట్టాలి.. లేదంటే గర్భవతినైనా చేయాలి అన్న బాలకృష్ణ వ్యాఖ్యలపై ఎల్లో మీడియా ఎందుకు చర్చకు పెట్టలేదు?. లోకేష్ అశ్లీల చిత్రాలపై చర్చ ఎందుకు పెట్టరు?
ఫేక్ వీడియోను వైరల్ చేసి.. బీసీ ఎంపీనైన తనను హింసిస్తున్నారని గోరంట్ల మాధవ్ ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ల మీద చర్చ లేకుండా ఒక్క తనపైనే చర్చే అంటే అది వారి కుల వివక్షకు, కుల దురహంకారానికి పరాకాష్ట అన్నారు.
ఓటుకు నోటు వీడియో తనది కాదని చంద్రబాబు కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణం చేస్తే తాను కూడా ప్రమాణం చేస్తానని..తన రాజీనామా పత్రాన్ని ఎడమ చేత్తో నీ మూతి మీద పడేస్తానంటూ సవాల్ విసిరారు. చంద్రబాబుకు దమ్ముంటే సవాల్ను స్వీకరించాలని డిమాండ్ చేశారు
తిరుమల వీఐపీ దర్శనాలపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు!