పేరుకు పేదలకు ఇళ్ల స్థలాల పథకం.. కానీ అది వైసీపీ పెద్దలకు దోచిపెట్టే పథకంలా మారిందని టీడీపీ నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇళ్ల స్థలాల పథకం పేరుతో వైసీపీ నేతలు దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. ఈ భూముల కొనుగోలుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి లేఖ రాశానని చంద్రబాబు తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లాలో నివాసయోగ్యం కాని ముంపు ప్రాంతాలను ఎకరా రూ.5 లక్షలు చేయని ఆవభూములను ఎకరా రూ.45 లక్షలకు ప్రభుత్వంతో కొనిపించి వైసీపీ నేతలు తమ కమీషన్లను కోట్లలో దండుకున్నారని చంద్రబాబు చెప్పారు. ఇలాంటి స్కామ్ లు రాష్ట్రమంతా చోటు చేసుకున్నాయని అన్నారు.
జగన్ సైకో ఇజంతో ఈ ప్రభుత్వం ముందుకు: నారా లోకేశ్