telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతి : … హై కమిటీ నివేదిక తరువాతే.. రాజధానిపై నిర్ణయం..

minister peddireddy on AP capital

ఏపీ రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఈ రోజు పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమరావతిపై కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధానా లేక గ్రామమా ? అని ప్రశ్నించారు. రాజధాని తయారీకి వందేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు. పదిశాతం ప్రజలకు సచివాలయం, హైకోర్టుతో అవసరం ఉండదన్నారు. హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత.. శాసన సభను సమావేశపరిచి రాజధానిపై వివరాలను ప్రకటిస్తామని చెప్పారు.

Related posts