హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో సిమి ఉగ్రవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాట్నా, బోధ్గయలలో 2013లో జరిగిన బాంబు పేలుళ్లలో పాల్గొని ఆ తర్వాత సౌదీ అరేబియాకు పారిపోయిన సిమి ఉగ్రవాది కెమికల్ అలీ, అలియాస్ అజారుద్దీన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. అలీ అరెస్ట్తో ఈ కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య మొత్తం 17కు చేరుకుంది.
రాయ్పూర్కు చెందిన అలీ, సౌదీలోని ఓ సూపర్ మార్కెట్లో పనిచేస్తున్నాడు. తాజాగా, కుటుంబ సభ్యులను కలిసేందుకు నగరానికి వచ్చిన అలీని పోలీసులు పక్కా సమాచారంతో ఎయిర్పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ కోసం చత్తీస్గఢ్ తీసుకెళ్లారు. అయితే, అలీ నిజంగానే కుటుంబ సభ్యులను కలిసేందుకు వచ్చాడా? లేక, నగరంలో ఎక్కడైనా బాంబు పేలుళ్లకు కుట్ర పన్నాడా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
టీటీడీ బోర్డును సీబీఐ ఛార్జ్ షీట్ లా చేశారు: అనురాధ ఫైర్