telugu navyamedia
తెలంగాణ వార్తలు

అనుకున్న‌ది సాధించారు..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటనపై దేశంలోని రైతులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న విష‌యం తెలిసిందే.. ఈ క్ర‌మంలో తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు.

పదవుల్లో ఉన్నవారి కంటే ప్రజల అధికారం గొప్పదని, అలుపెర‌గ‌ని పోరాటంతో రైతులు మరోమారు తమ శక్తిని చాటారని కొనియాడారు మంత్రి కేటీఆర్‌. రైతులు తమ ఆందోళనలతో అనుకున్నది సాధించారని ఆయన అన్నారు. జై జవాన్… జై కిసాన్ అన్న నినాదాన్ని ట్విట్టర్‌ ద్వారా పంచుకున్నారు.

Related posts