*బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డ మంత్రి కేటీఆర్..
*కేంద్రంపై ట్విట్టర్ లో మోదీపై విమర్శనాస్ర్తాలు
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ట్విట్టర్ వార్ కొనసాగుతూనే ఉంది. నిత్యం సోషల్ మీడియా వేదికగా ఇరుపార్టీల నేతలు విమర్శలు చేసుకుంటూనే వుంటారు.
తాజాగా కేంద్రప్రభుత్వాన్ని, ప్రధాని మోదీ పాలనపై మంత్రి కేటీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.
బీజేపీ పాలనలో బొగ్గు కొరత , కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల్లో కూడా కొరతేనని కేటీఆర్ విమర్శించారు. ఈ సమస్యలన్నింటీకి పీఎం మోదీకి ఉన్న విజన్ కొరతే మూలమని ఆయన ట్వీట్ చేశారు.
బీజేపీ పాలనలో *బొగ్గు కొరత*
కరోనా టైంలో *ఆక్సిజన్ కొరత*
పరిశ్రమలకు *కరెంట్ కొరత*
యువతకు *ఉద్యోగాల కొరత*
గ్రామాల్లో *ఉపాధి కొరత*
రాష్ట్రాలకిచ్చే *నిధుల కొరత*అన్ని సమస్యలకు మూలం PM
*మోడీకి విజన్ కొరత*NPA Govt’s amazing performance 👏 pic.twitter.com/N5oMBuVeDF
— KTR (@KTRTRS) May 2, 2022


కరీంనగర్ కేంద్రంగానే మరో ఉద్యమం చేయాల్సి వస్తుంది : ఈటల