తెలంగాణలో లాక్ డౌన్ పై వస్తున్న వార్తలపై తెలంగాణ రాష్ర్ట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో లాక్డౌన్ పెట్టే ఆలోచన లేదని ఈటల స్పష్టం చేశారు. లాక్ డౌన్ పై తుది నిర్ణయం సీఎం కేసీఆర్ దేనని ఈటల పేర్కొన్నాడు. రేపట్నుంచి 19 జిల్లా డయాగ్నొస్టిక్ హబ్లు ప్రారంభిస్తామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారికి జిల్లా డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో రక్త పరీక్షలు నిర్వహిస్తామన్నారు. హోం ఐసోలేషన్లో ఉన్న వారు 3, 4 రోజులకు ఒకసారి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. రాష్ర్టంలో ఔషధాలు, ఆక్సిజన్ ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటల హెచ్చరించారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ర్ట, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. కేంద్రం కేటాయించే వ్యాక్సిన్లను బట్టి రాష్ర్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. టీకాలు వచ్చే పరిస్థితిని బట్టి ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.
previous post
జగన్ ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని హిందూ ధర్మాన్ని కాపాడాలి: స్వామి శ్రీనివాసానంద