telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఏపీకి వెళ్లేందుకు చంద్రబాబు దరఖాస్తు

chandrababu

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు హైద్రాబాద్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాను ఏపీకి వెళ్లేందుకు అనుమతించాలని చంద్రబాబు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోగా, తెలంగాణ ప్రభుత్వం నుంచి వెంటనే అనుమతి లభించింది. ఏపీ సర్కారు మాత్రం దాన్ని పెండింగ్ లో పెట్టింది. తాను హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధితులను పరామర్శిస్తానని ఏపీ డీజీపీకి లేఖ రాస్తూ, ఆపై ఆన్ లైన్ లో రెండు రాష్ట్రాల డీజీపీలనూ అనుమతి కోరారు.

తెలంగాణ డీజీపీ కార్యాలయం వెంటనే అనుమతి మంజూరు చేయగా, ఏపీ డీజీపీ కార్యాలయం ఇంకా స్పందించలేదు. కాగా, మార్చి 20న హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు, అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయారన్న సంగతి తెలిసిందే. తాను సోమవారం ఉదయం 10.35 గంటలకు బయలుదేరి విశాఖ వెళతానని చంద్రబాబు తన దరఖాస్తులో కోరారు.

Related posts