దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖలు రాశారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని లేఖలో పేర్కొన్నారు. అదే సమయంలో ప్రజలకు నిత్యావసరాల కొరత లేకుండా చూడాలని చెప్పారు.
లాక్డౌన్ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలూ తీసుకోవాలని ఆమె కోరారు. భారత్లో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతోన్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోనూ జనాలు గుమికూడకుండా ఆ పార్టీ తగు చర్యలు చేపట్టింది.