telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తాగునీటి సమస్య తీర్చేందుకు కృషి : బాలినేని

balineni srinivas reddy

ప్రకాశం జిల్లాలో తాగునీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తామని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సాగు, తాగునీరు అందించేందుకు చర్యలు చేపడతామని చెప్పారు. రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కారిడార్, నిమ్జ్ పనులపై సమీక్షించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ గత ఐదేళ్లుగా ఈ జిల్లాలో తాగునీటి సమస్య ఉందన్నారు.

ఒంగోలు, మార్కాపురంలో తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో తాగునీటి సమస్య లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామని అన్నారు. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తామని, ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే జిల్లాలో తాగునీటి సమస్య ఉండదని అన్నారు. రైతులకు పగటిపూట తొమ్మిది గంటల విద్యుత్ అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

Related posts