మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ మీద కూడా కన్నేసినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళంలో అజిత్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్నై అరిందాల్’ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారట…
ఖైదీ నెంబర్ 150తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుస సినిమాలతో చిరంజీవి దూకుడు పెంచారు. సైరా నర్సింహా రెడ్డి తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన మెగాస్టార్ ఆ గ్యాప్ను పూడ్చడానికే అన్నట్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు సైన్ చేస్తూ అభిమానుల్లో జోష్ను పెంచారు. కుర్ర హీరోలకి ఏ మాత్రం తక్కువ కాకుండా ఒకదాని తర్వాత మరోకటి అన్నట్లు వరుస రిమేక్ సినిమాలతో బిజీ అయిపోతున్నారు.
ప్రస్తుతం ఆచార్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన చిరు.. అనంతరం మోహన్ లాల్ హీరోగా మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్లో నటించనున్నారు. దీని తర్వాత కూడా చిరు.. మరొకటి తమిళంలో హిట్ అయిన వేదాళమ్ రీమేక్లో మెహర్ రమేశ్ దర్శకత్వంలో నటిచంనున్నారు . ఇక ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్లోనూ ఓ సినిమా చేయనున్నాడు.
ఇదిలా ఉంటే మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ మీద కూడా కన్నేసినట్టు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం తమిళంలో అజిత్ హీరోగా నటించిన యెన్నై అరిందల్ సినిమాపై ప్రస్తుతం చిరు మనసు పడ్డట్లు తెలుస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఎన్నై అరిందాల్’ సినిమా ఏ రేంజ్ లో హిట్టైందో తెలిసిందే. ఈ సినిమాలో హీరో క్రిమినల్ కేసు నుంచి ఓ యువతిని కాపాడే మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడు. ఇక చిరు ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ సరైన దర్శకుడి కోసం వేట మొదలు పెట్టినట్లు సమాచారం.
ఈ సినిమాను సొంత బ్యానర్ కొణిదెల ప్రొడక్షన్స్ హౌజ్ పై రామ్ చరణ్ నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తపై ఫుల్ క్లారిటీ రావాలంటే కొన్ని నెలలు ఆగాల్సిదే.