telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మహేష్ సెట్లో అడుగుపెట్టేది అప్పుడేనా ?

SVP

పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూర్చుతున్నాడు. ఈ సినిమాకు మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైనట్టు తమన్ తాజాగా వెల్లడించాడు. అయితే ఈ సినిమా తర్వాత వెంటనే పరశురామ్ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నా కరోనా ఎంట్రీ ఇవ్వడంతో అది కుదరలేదు. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుతుండటం తో తిరిగి సినిమా షూటింగ్స్ మొదలవుతున్నాయి. కొంత మంది హీరోలు మాత్రం ఇప్పట్లో షూటింగ్ చేయకపోవడమే మంచిదని భావిస్తున్నారు. ఇక సూపర్ స్టార్ మహేష్ కూడా ఇప్పట్లో షూటింగ్ మొదలు పెట్టే ఆలోచనలో లేరని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే యాడ్ షూటింగ్స్ లో పాల్గొన్నాడు మహేష్.. యాడ్ షూట్ అయితే తక్కువ మందితో అయిపోతుంది కానీ సినిమా షూటింగ్ అంటే వందల మందితో కలిసి పని చెయ్యాల్సిందే. అందుకే ఇప్పుడు రిస్క్ తీసుకోవడం కరెక్ట్ కాదని భావిస్తున్నారట. ఈ రెండు నెలలు గ్యాప్ ఇచ్చి వచ్చే ఏడాది జనవరి నుంచి సినిమాను మొదలు పెట్టి చకచకా కంప్లీట్ చేయాలని చూస్తున్నారట.

Related posts