మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు.
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ ఈ ఉదయం ముంబై నుంచి బారామతికి బయలుదేరారు.
విమాన ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్లు డీజీసీఏ వెల్లడి. మృతుల్లో అజిత్ పవార్, ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు.
ఉదయం 8.45 గంటలకు బారామతిలో ఘటన జరిగింది. జడ్పీ ఎన్నికల ప్రచారానికి ముంబయి నుంచి వెళ్తుండగా ప్రమాదం జరిగింది
అజిత్ పవార్ 1959 జులై 22న మహారాష్ట్రలో జన్మించారు. అజిత్ పవార్ మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడి కుమారుడు.
1991లో బారామతి నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికైనారు. బారామతి నుంచి అజిత్ పవార్ ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు.
ఆరుసార్లు మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా సేవలందించిన అజిత్ పవార్ – 2022-2023 వరకు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
ఉదయం 8 గంటలకు ముంబై నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం, గంట తర్వాత బారామతి ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతుండగా ప్రమాదానికి గురైంది.
విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురూ అక్కడికక్కడే మృతి చెందినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వర్గాలు ధ్రువీకరించాయి.

