మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు ఏపీ శాసనమండలికి హాజరైయ్యారు. ఆయనను మంత్రి లోకేశ్ ఆత్మీయంగా పలకరించారు.
‘బొత్స సత్యనారాయణ గారు నమస్కారం’ అంటూ పలకరించారు మంత్రి. బొత్స సత్యనారాయణ వినకపోవడంతో వెంటనే కల్పించుకున్న చైర్మన్.. ‘మంత్రి నారా లోకేశ్ మిమ్మల్ని పరామర్శిస్తున్నారు’ అంటూ బొత్సకు తెలియజేశారు.
వెంటనే మంత్రి మాట్లాడుతూ..‘గురువుగారు చిన్న అనారోగ్య సమస్యతో బాధపడ్డారు. ఆయన తిరిగి ఆరోగ్యంగా హౌస్కు రావడం ఆనందంగా ఉంది’ అని మంత్రి లోకేశ్ అన్నారు.
ఇటీవల మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. వెంటనే ఆయనను కుటుంబసభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.
చికిత్స అనంతరం మాజీ మంత్రి కోలుకున్నారు.


మార్చిలో కేటీఆర్ కు పట్టాభిషేకం…