telugu navyamedia
క్రైమ్ వార్తలు

మద్యంలో పురుగుల మందు కలుపుకొని ఎస్ ఐ ఆత్మహత్య

ఏపీలో దారుణ సంఘటన చోటు చేసుకుంది.డ్యూటీలో చేరి చాలా 15 ఏళ్లు అవుతోన్నా ప్రమోషన్‌ రాలేదన్న ఆవేదనతో ఓ ఎస్‌ఐ తన ప్రాణాలనే తీసుకున్న సంఘటన కలకలం రేపింది.

వివార్లాలోకి వెళితే..

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్న రాఘవరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. రాఘవరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1991 బ్యాచ్‌కు చెందిన రాఘవ రెడ్డికి ఇప్పటి వరకు ఒక్క ప్రమోషన్‌ కూడా రాలేదు. తన బ్యాచ్‌కి చెందిన వారంత మాత్రం డీఎస్పీలుగా పదోన్నది పొందారని తాను మాత్రం ఇంకా అక్కడే ఉన్నానని మదనపడుతుండే వాడని తెలుస్తోంది.

దానికి తోడు కుటుంబ పరిస్థితుల కూడా తోడవ‌డంతో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. ఇద్దరు కుమారులు వేరే రాష్ట్రంలో ఉద్యోగం చేస్తున్నారని పోలీసులు తెలిపారు.

Related posts