telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

నాకు బహుమతిగా .. పుస్తకాలు మాత్రం ఇవ్వండి… కిషన్ రెడ్డి

kishanreddy asking books as gifts

సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన బీజేపీ నేత కిషన్ రెడ్డి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. తనను అభినందించేందుకు వచ్చే మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, కార్యకర్తలు ఎవరూ పుష్పగుచ్చాలు, పూలదండలు, శాలువాలు తీసుకురావొవ్దని, వాటికి బదులు నోటు పుస్తకాలు తీసుకురావాలని కోరారు.

ఆయన పిలుపునకు అనూహ్య స్పందన వచ్చింది. ఆయనను అభినందించేందుకు వచ్చిన వారు నోటు పుస్తకాలు తీసుకొచ్చి ఇచ్చి అభినందించారు. అలా ప్రతి ఒక్కరు పుస్తకాలు తీసుకురావడంతో ఓ గది నిండిపోయింది. పుస్తకాలను తీసుకొచ్చిన అందరికీ కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ఈ పుస్తకాలను ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు పంపిణీ చేస్తామని పేర్కొన్నారు.

Related posts