అవిశ్వాస పరీక్షలో కర్ణాటక సీఎం పదవిని కోల్పోయిన కుమారస్వామి రాజకీయాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు మంచి వాళ్ల కోసం కాదని అన్నారు. రాజకీయాలు కులాలతో ముడిపడి ఉన్నాయని అన్నారు. కులాల రొంపిలోకి తన ఫ్యామిలీని లాగవద్దని చెప్పారు. ప్రశాంతంగా గడిపేందుకు రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. ప్రస్తుత రాజకీయాలు ఎటువైపు పయనిస్తున్నాయో గమనిస్తున్నానని తెలిపారు. ఎవరినో సంతోషపెట్టేందుకు తాను రాజకీయాల్లో లేనని స్పష్టం చేశారు. ప్రజల శ్రేయస్సు కోసమే పనిచేశానని తనకు ఆ సంతృప్తి చాలని అన్నారు. “ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చాను, ఊహించని విధంగా సీఎం అయ్యాను అని ఆయన వ్యాఖ్యానించారు.