*పోలీసుల అదుపులో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు
*వ్యక్తి గత విషయాల్లో జోక్యం చేసుకున్నందుకే హత్య చేసినట్లు సమాచారం..
*డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో వివారాలు సేకరిస్తున్న పోలీసులు..
*హత్య ఘటన వివరాలు సాయంత్రం మీడియాకు పోలీసులవెల్లడి..
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారు. మూడురోజులుగా కనిపించకుండా పోయిన ఆయన్ను ప్రత్యేక పోలీసు బృందాలు గాలించి ఆదివారం రాత్రి పట్టుకున్నాయి.
తన వ్యక్తిగత వ్యవహారాల్లో సుబ్రహ్మణ్యం జోక్యం చేసుకున్నందునే హత్య చేశానని ఎమ్మెల్సీ అనంత బాబు ఒప్పుకున్నారు. సుబ్రహ్మణ్యం హత్యలో తాను ఒక్కడే పాల్గొన్నట్లు విచారణలో తెలిపారు.
కానీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేసినట్లు పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు. అయితే సుబ్రహ్మణ్యం హత్య కేసుకు సంబంధించిన వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని కాకినాడ పోలీసులు చెబుతున్నారు.
ఈ ప్రకటన కోసం ఏపీ వ్యాప్తంగా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరికాసేపట్లో ఆయన్ను రిమాండ్ తరలించి కోర్టులో హాజరుపరచనున్నారు.

