telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అనంత‌బాబు విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంది- బోత్స‌

*అనంత‌బాబు విష‌యంలో చ‌ట్టం త‌న ప‌ని తాను చేస్తుంది..

*ఎమ్మెల్సీసస్పెన్షన్ పై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటుంది..
*పార్టీ ప‌రంగా ఏ నిర్ణ‌యం తీసుకుంటామో త‌రువాత చూస్తాం..

సొంత కారు డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న  వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ ను పోలీసులు విచారిస్తున్నారు.

దీనిపై స్పందించిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.. అనంతబాబు విష‌యంలో  చట్టం తన పని తాను చేసుకుపోతుందని, అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ వెల్ల‌డించారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇప్ప‌టికే ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. 302 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారని అన్నారు. ఎమ్మెల్సీపై సస్పెన్షన్ వ్యవహరం పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.

Related posts