telugu navyamedia
రాజకీయ వార్తలు

కశ్మీర్ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టిన అమిత్ షా!

amitsha about 370 article in campaign

లోక్ సభ, రాజ్యసభలో జీరో అవర్ ను రద్దు చేశారు. రాజ్యసభలో సభాధిపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ విపక్ష సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాలపై కూడా చర్చ జరగబోదని స్పష్టం చేశారు. కేవలం జమ్ముకశ్మీర్ పై చర్చ మాత్రమే జరుగుతుందని తెలిపారు. అనంతరం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా జమ్ముకశ్మీర్ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. జమ్ముకశ్మీర్ పై చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అమిత్ షా ప్రసంగాన్ని అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు అడ్డుతగులుతున్నారు. ఈ క్రమంలో విపక్ష సభ్యులపై వెంకయ్యనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్ర గందరగోళం మధ్య అమిత్ షా తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.

Related posts