telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేసీఆర్ స్ఫూర్తితో గ్రీన్ చాలెంజ్ కొనసాగిస్తున్న జోగినపల్లి సంతోష్ కుమార్ – 8వ విడత ప్రారంభం కీసరగుట్టలో

మాజీ సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో గ్రీన్‌ చాలెంజ్‌ ప్రారంభించానని, దీనిని నా జీవితాంతం కొనసాగిస్తానని మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్‌‌కుమార్‌ తెలిపారు.

8వ విడత గ్రీన్‌ చాలెంజ్‌ను ఆయన ఆదివారం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా కీసరగుట్టలో స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డితో కలిసి మొక్కలు నాటి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏడేళ్లుగా రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులే, కవులు, కళాకారులు, సామాన్యులను ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాములను చేశామని చెప్పారు.

ఇప్పటివరకు 20 కోట్ల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు.

Related posts