దేశంలో కరోనా కలకలం కొనసాగుతుంది. ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ మెయిల్, ఎక్స్ప్రెస్, సబర్బన్, ప్యాసింజర్ సర్వీసుల రద్దును సెప్టెంబర్ 30 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ప్యాసింజర్ రైళ్లపై విధించిన రద్దు ఆగష్టు 12తో ముగుస్తుండటంతో రైల్వేశాఖ మరోసారి ఆ తేదీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ప్రస్తుతం నడుస్తున్న 230 స్పెషల్ ట్రైన్స్ మాత్రం నడుస్తాయని తెలిపింది. రైళ్లలో ప్రయాణించేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
previous post
next post


కేసీఆర్ దుష్టపాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తాం: రేవంత్ రెడ్డి