telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత్-ఆసీస్ : రేపే మొదటి మ్యాచ్…

3rd odi between india-australia today

ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత జట్టు మొత్తం క్వారంటైన్ లోనే ఉంటూ ప్రాక్టీస్ చేసింది. ఈ పర్యటన రేపటి నుంచి ప్రారంభం కానుంది. రేపు ఆసీస్ తో భారత్ మొదటి వన్డే మ్యాచ్ ఆడనుంది. ఆ కారణంగా ప్రస్తుతం భారత ఆటగాళ్ల పేర్లు ట్విట్టర్లో ట్రెండ్ లోకి వచ్చాయి. అందులో ముఖ్యంగా భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అలాగే రవీంద్ర జడేజాల పేర్లు ఎందుకంటే… హార్దిక్ గత ఏడాది చేయించుకున్న శస్త్రచికిత్స తర్వాత మళ్ళీ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. మార్చిలో జరగాల్సిన దక్షిణాఫ్రికా సిరీస్ కు ఎంపికైన… అందులో మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా తర్వాత రెండు మ్యాచ్ లు కరోనా కారణంగా రద్దయ్యాయి. ఇక జడేజా చివరి సరిగా ఈ రెండు జట్లు ఎదురుపడినప్పుడు జడేజా ఉస్మాన్ ఖ్వాజాను చేసిన రన్ ఔట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. మరి ఇక రేపు ఉదయం 9:10 గంటలకు భారత్-ఆసీస్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. మరి ఇందులో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.

Related posts