telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంట్లోనే క్వారంటైన్‌ ఉండనున్న భారత ఆటగాళ్లు…

న్యూజిలాండ్ తో తలపడనున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్home quarantine for indians players, ఇంగ్లండ్ టెస్టులకు ఎంపికైన భారత క్రికెటర్లు.. అక్కడికి వెళ్లే ముందు 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు బీసీసీఐ ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో ఆటగాళ్లకు ఇంటివద్దే ఆర్టీ-పీసీఆర్ టెస్టు కూడా చేయనున్నారు. ఇంగ్లండ్ పర్యటన కోసం 20 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలెక్టర్లు ఇప్పటికే ఎంపిక చేసిన విషయం తెలిసిందే. నలుగురు స్టాండ్‌బై ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికయిన భారత ఆటగాళ్లు 14 రోజులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంటారు. ఆ సమయంలో ఆర్టీ-పీసీఆర్ టెస్టులను ఆటగాళ్ల ఇంటివద్దే బీసీసీఐ నిర్వహిస్తుంది. క్రికెటర్లతో పాటు ఇంగ్లండ్ టూర్‌కి వెళ్లాలనుకున్న ఆటగాళ్ల ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా క్వారంటైన్‌లో ఉండి టెస్టులు చేయించుకోవాలి. కోచింగ్, సహాయ సిబ్బందికి కూడా ఇవే రూల్స్ ఉంటాయి. మరో రెండు మూడు రోజుల్లో ఈ ప్రక్రియ మొదలు కానుంది.

Related posts