telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యాత్రికుల బస్సు ప్రమాదానికి గురై… 35మంది మృతి..

Accident

మక్కా యాత్రికులతో వెళ్తున్న బస్సును ప్రొక్లెయినర్ ఢీకొట్టిన ఘటనలో 35మంది మరణించారు, నలుగురు గాయపడ్డారు. సౌదీ అరేబియాలోని మదీనా నగరంలో ఈ ప్రమాదం జరిగింది. మదీనా నగరంలోని అల్ అఖల్ సెంటర్ గ్గర బస్సు వస్తుండగా ప్రొక్లెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన నలుగురిని అల్ హమ్నా ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సులో సౌదీ అరేబియాతోపాటు ఆసియా దేశాలకు చెందిన యాత్రికులున్నారని మదీనా పోలీసులు తెలిపారు. గాయపడిన నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్లు చెప్పారు.

ఈ ఘటన పవిత్ర క్షేత్రం మక్కా సమీపంలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన బస్సులో ఏషియన్ అరబిక్ పౌరులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఈ ఘటనపై విచారణ ప్రారంభించారు.

Related posts