telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విజయసాయి జోడు పదవులపై ఫిర్యాదు!

vijayasaireddy ycp

జోడు పదవులు అనుభవిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత విజయసాయి రెడ్డిపై అనర్హత వేటు వేయాలని సీహెచ్ రామకోటయ్య రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయి, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగానూ జోడు పదవులను అనుభవిస్తున్నారని ఆరోపించారు. తన ఫిర్యాదును రాష్ట్రపతికి పంపుతూ విజయసాయిని అనర్హుడిగా ప్రకటించాలని రామకోటయ్య కోరారు.

ఇదే ఫిర్యాదును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన రాష్ట్రపతి, సలహా కోరగా, పార్లమెంట్ అనర్హత నిరోధక చట్టం 1959 ప్రకారం, ప్రత్యేక ప్రతినిధిగా ఎటువంటి వేతనం, భత్యం తీసుకోని విజయసాయిపై, ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కింద చర్యలు తీసుకునే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. దీంతో ఆయనపై అనర్హత వేటు చెల్లబోదని రాష్ట్రపతి పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Related posts