ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయిన విషయం తెలిసిందే. నేటి సమావేశాలలో ఉదమం 9 గంటలకు గవర్నర్ నరసింహన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రభుత్వ ప్రాథమ్యాలు, నవరత్నాలకు సంబంధించిన అంశాలపై ముఖ్యంగా గవర్నర్ ప్రసంగం కొనసాగనుంది.
జ్యూడీషియల్ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. రేపు, ఎల్లుండి అసెంబ్లీకి సెలవు. ఈ నెల 17, 18న గవర్నర్ ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానం ఉండనున్నాయి.

