telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

బాలికల కోసం తొలి ప్రభుత్వ పాలిటెక్నిక్‌

Gurukulam entrance exam notification released
బాలికల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల జూన్‌ 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నది. హైదరాబాద్‌ నగరంలోని మారేడుపల్లిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ఆవరణలోనే బాలికల కోసం ఏర్పాటు చేస్తున్నారు. విశాలమైన గదులు, ఇతర సదుపాయాలతో  ఈ బాలికల కళాశాలలో జూన్‌ 1నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
ఈ కళాశాలలో తొలిసారిగా కంప్యూటర్‌ ల్యాబ్‌, ఇంగ్లిష్‌ ల్యాబ్‌, ట్యుటోరియల్‌, లైబ్రరీ, కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌, సివిల్‌ ఇంజనీరింగ్‌, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌, హోమ్‌ సైన్స్‌ కోర్సులు నిర్వహిస్తారు. ఒక్కో కోర్సులో 60 సీట్లు కేటాయిస్తారు. మే రెండో వారంలో జరిగే కౌన్సెలింగ్‌ అనంతరం ర్యాంకులు పొందిన విద్యార్థులు జూన్‌ 1వ తేదీ నుంచి తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది.

Related posts