చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టమేంటని బండి సంజయ్ ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు కాపీలను గతంలో చింపిన ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు అంటకాగుతున్నారని ఆయన నిలదీశారు.
ఎన్ని కుట్రలు చేసినా మహిళా రిజర్వేషన్లను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
మహిళా ప్రాతినిధ్యాన్ని అడ్డుకోవడమే కాంగ్రెస్ లక్ష్యమని, ప్రతి రాష్ట్రంలోనూ 50 శాతం సీట్లను పెంచితే అభ్యంతరం ఏంటని ఆయన పేర్కొన్నారు.

