కేంద్ర మాజీ మంత్రి చిదంబరంపై సీబీఐ ఐఎన్ ఎక్స్ మీడియా కేసులో ఢిల్లీ కోర్టులో ఛార్జిషీట్ సమర్పించింది.ఐఎన్ ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి నిధులు సమకూర్చడంలో చిదంబరం అధికార దుర్వినియోగం చేశారని సీబీఐ తన ఛార్జీషీట్ లో పేర్కొంది. రెండు రోజుల క్రితం ఈడీ మనీలాండరింగ్ కేసులో ప్రశ్నించడానికి చిందంబరంను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తమ అదుపులోకి తీసుకుంది.
నిన్న చిదంబరం జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 24వరకు ఢిల్లీ కోర్టు పొడిగించింది.ఈ కేసులో చిదంబరంతో పాటు మరో 13 మందిని నిందితులుగా పేర్కొంది. ఇందులో ఐఎన్ ఎక్స్ మీడియా అధిపతులు పీటర్ ముఖర్జియా, ఇంద్రాణీ ముఖర్జియా, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం తదితరులున్నారు. ఈ కేసులో తొలుత చిదంబరంను ఆగస్ట్ 21న సీబీఐ అరెస్ట్ చేసి తీహార్ జైలుకు తరలించింది. అక్కడే ఆయనను విచారించింది.

