2001లో పార్లమెంట్పై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని మోడీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, హోంమంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు శుక్రవారం నివాళులు అర్పించారు. సరిగ్గా నేటికి తొమ్మిదేళ్ళ క్రితం 2001, డిసెంబరు 13న లష్కరే తోయిబా (ఎల్ఇటి), జైష్ ఎ మహ్మద్ (జెమ్) ఉగ్రవాదులు పార్లమెంట్ కాంప్లెక్స్పై జరిపిన దాడిలో 9 మంది మృతి చెందారు.
ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన 5గురు, సెంట్రల్ రిజర్వు పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్) దళానికి చెందిన ఒక మహిళ, ఇద్దరు పార్లమెంట్ సిబ్బంది, ఒక గార్డనర్ మృతి చెందిన వారిలో ఉన్నారు. తీవ్రంగా గాయపడిన ఒక జర్నలిస్ట్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. దాడికి పాల్పడిన ఐదుగురు ఉగ్రవాదులు మృతి చెందిన సంగతి తెలిసిందే.